-Advertisement-

దారుణం ..నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో కుక్కి..

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారున్ని దారుణంగా చంపి సూట్ కేసులో దాచిపెట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. తన భర్తతో విభేదాల కారణంగా ఓ కసాయి తల్లి తన నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో తరలిస్తుండగా పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన మైండ్‌ఫుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈఓ సూచనా సేథ్ విభేదాల కారణంగా తన భర్తతో దూరంగా ఉంటుంది. శనివారం తన కొడుకుతో కలిసి గోవా వెళ్లగా సోమవారం బెంగళూరు వెళ్లేందుకు రూం ఖాళీ చేసింది. హోటల్ సిబ్బంది రూంలో రక్తపు మరకలను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలిసులు ఆమె వెళ్తున్న టాక్సీ డ్రైవరుతో మాట్లాడగా తన కొడుకును గోవా లోని స్నేహితుని ఇంట్లో వదిలినట్లు సమాధానం ఇచ్చింది. అక్కడ ఆరా తీస్తే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది. చివరకు ఆమె కారును చెక్ చేయగా సూటుకేసులో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
Comments
 -Advertisement-