-Advertisement-

ఎంపీడీవోను సస్పెండ్ చేయాలి

Vaasthava Nestham

 ఎంపీడీవోను సస్పెండ్ చేయాలి- జై ఆదివాసి యువశక్తి నాయకుల డిమాండ్

Vaasthava Nestham Ichoda News
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఆదివాసి నాయకులతో బాధ్యత రహితంగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఇచ్చోడ ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని జై ఆదివాసి యువశక్తి రాష్ట్ర కో కన్వీనర్ మేస్రం ఆనంద్ రావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ లోని లేఅవుట్ల పైన, అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకోవాలని గత నెల 15వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీఓ లకు ఫిర్యాదు చేసి, అదేవిధంగా ఎంపీడీవోకు ఫిర్యాదు చేయగా విచారణ జరుపుతామని చెప్పడంతో శనివారం ఇట్టి విషయంపై జై ఆదివాసి యువశక్తి నాయకులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి గత నెల 15వ తేదీన ఫిర్యాదు చేసిన విషయంపై ఎంపీడీవోను అడగగా, ఆదివాసీ నాయకులైన తమను ఎంపీడీవో బెదిరిస్తూ, బాధ్యత రహితంగా మాట్లాడారుని జై ఆదివాసి యువశక్తి నాయకులు ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు చేపట్టకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ సెక్రెటరీ, ఎంపీఓ లపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపై గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై ఆదివాసి యువశక్తి జిల్లా అధ్యక్షుడు బిపిన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేస్రం ప్రకాష్, ఉపాధ్యక్షుడు తొడసం శంకర్, మండల అధ్యక్షుడు సిడాం సునిల్ కుమార్ పాల్గొన్నారు.

Comments
 -Advertisement-