-Advertisement-

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహణ

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,బెల్లంపల్లి: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రేచిని బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో  బారేపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత ఎం.వి రూరల్ ఫోక్ ఆర్చ్ ఆర్గనైజేషన్ కర్నూల్ కళాజాత వారిచే బ్యాంకు పథకాలపై అవగాహన కల్పించారు. క్రాప్ లోన్, పొదుపులోన్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, గోల్డ్ లోన్, రుణమాఫీ లపై ముఖ్యంగా సామాజిక భద్రత పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, నగదు రహిత లావాదేవీల పై, సైబర్ మోసాలపై జాగ్రత్త వహించాలని ప్రజలకు అర్థమైనటువంటి రూపకంగా మాటల ద్వారా, పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా కళాజాత బృందం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమనకు బ్యాంకు మేనేజర్ రాజేంద్ర, కళాజాత బృందం సభ్యులు ,మెజీషియన్ తేజ కుమార్, డప్పు ప్లేయర్ వేణు, రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-