-Advertisement-

విద్యార్థి జీవితం చెరిగిపోని మధుర జ్ఞాపకం

Vaasthava Nestham
- ఘనంగా విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

వాస్తవ నేస్తం,లోకేశ్వరం: స్నేహ బంధానికి మించిన బంధం మరొకటి లేదని పలువురు పూర్వ వి ద్యార్థులు అన్నారు. లోకేశ్వరం మండలం మన్మద్ ప్రాథమికోన్నత పాఠశాలలో 2003-2004 బ్యాచ్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరుపుకున్నారు. ముందుగా 20 సంవత్సరాల తర్వాత కలిసిన సంద ర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని ఆలింగనాలు చేసుకున్నారు. పాఠశాలలో చదువుకునే రోజులలో సరదాగా ఆడిన ఆటలు, పాటలు ఒకరిపై ఒకరు వేసుకున్న జోకులను గుర్తు చేసుకొని నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర అత్యంత కీలకమైందని ఎంత సంపాదించాం అనే దాని కంటే ఎందరు మిత్రులను పొందాము అనేది ముఖ్యమన్నారు. ఎవరెవరు ఏ రంగాల్లో స్థిరపడినా కష్టసుఖాలలో ఒకరికొకరు తమ శక్తులను ధారబోసి విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగితే మాకు దాన్ని మించిన తృప్తి మరొకటి లేదన్నారు. అంతరం విద్య నేర్పిన అధ్యాపకులను శాలువాతో ఘ నంగా సన్మానించి కమ్మనైన విందు భోజనం అరగించారు. చాలా ఏళ్ల తర్వాత కలిసిన సందర్భంగా పలువురు ఆలపించిన పాటలు, చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
 -Advertisement-