-Advertisement-

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

Vaasthava Nestham

- రోడ్డుపై తెగిపడ్డ శరీర భాగాలు


వాస్తవ నేస్తం,మంచిర్యాల: జిల్లాలోని మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో బైకుతో వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తుండగా అకస్మాత్తుగా లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీర భాగాలు తెగి రోడ్డుపై పడి ఉన్నాయి. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
 -Advertisement-