-Advertisement-

అయ్యో పాపం... చిన్నారులు...

Vaasthava Nestham

- నీటి గుంతలో పడి చిన్నారులు మృతి


వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆడుకుంటామని వెళ్లి అనంత లోకాలకు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెంలో విషాదం నెలకొంది. ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో యర్రగొండపాలెం గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ నీటి గుంట వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిగుంటలో పడిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటినా నీటి గుంటలో గాలించగా శివాజి(8), నాగసాయి(10) మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పండుగ వేల ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి.
Comments
 -Advertisement-