-Advertisement-

మానవత్వం చాటుకున్న పినపాక పాత్రికేయులు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,పినపాక: సమాజంలో జరుగుతున్న అవినీతి అక్షర రూపంలో అంతమొందించేందుకు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని సమాజ సేవలో పినపాక పాత్రికేయులు సంక్షేమ సంఘం మరువలేనివని తోగ్గూడెం ఎంపీటీసీ చింతపండు సత్యం అన్నారు. మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన బూరిక ముత్తయ్య ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోని మట్టి గోడ కూలి కాలువిరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేపించుకోలేని స్తోమత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పినపాక పాత్రికేయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు, నగుదు ను బాధితుని  కుటుంబానికి అందజేశారు. మరిన్ని సహాయ సహకారాలు అందించేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బిల్లా నాగేందర్, ప్రధాన కార్యదర్శి సనప భరత్, గౌరవ అధ్యక్షులు బూర శంకర్, పాత్రికేయులు మహేష్, దొడ్డి శీను, కోటి, దిలీప్, జగదీష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-