-Advertisement-

దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,పటాన్చెరు: నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండల పరిధిలోని జంగంపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ప్రభాకర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, గ్రామ సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాయికోటి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-