-Advertisement-

చిరుత దాడిలో ఆవు మృతి

Vaasthava Nestham
- భయాందోళన చెందుతున్న గ్రామస్తులు
- వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లాలంటే భయం భయం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలంలోని చిన్న మన్నూర్‌కు చెందిన పెందుర్ మారుతి అనే రైతు గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ఆవును కట్టేసి ఉంచారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆవుపై ఓ చిరుత పులి దాడి చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లాలంటే జంకుతున్నారు. అట్టివిశాఖ అధికారులు అప్రమత్తమై చిరుతను బందించాలని  గ్రామ ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా గుడియాత్నూర్ మండలం దామన్నగూడ గ్రామంలో ఆవుపై దాడి చేసిన చిరుత పులి వీడియో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది.
Comments
 -Advertisement-