-Advertisement-

MNCL: బస్సులు సీటు దొరుకుత లేదని.. బస్సు ముందు పడుకుని నిరసన

Vaasthava Nestham
వాస్తవ నేస్తం, వెబ్ డెస్క్: బస్సులో సీటు దొరకడం లేదని గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో బస్సులు ఆపకపోవడంపై ఓ వ్యక్తి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
సంక్రాంతి సెలవులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో బస్సులు రద్దీగా మారాయని ప్రయాణికులు అంటున్నారు. వ్యక్తి రోడ్డుపై పడుకోవడంతో దాదాపు గంటపాటు రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడు లేచాడు. ఈ వీడియో ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Comments
User
Comment Poster
Ok super
 -Advertisement-