-Advertisement-

సాయి బాలాజీ వైన్స్ పై చర్యలు తీసుకోవాలి

Vaasthava Nestham

- సీఐ కి వినతి పత్రం అందజేసిన పిడికిటి గోపాల్ చౌదరి


వాస్తవ నేస్తం,కూకట్పల్లి: నియోజకవర్గంలోని కెపిహెచ్బి కాలనీ, థర్డ్ ఫేస్ ఎల్ఐజి ప్లాట్స్ నందు సాయి బాలాజీ వైన్స్ ఏర్పాటు చేయడం వలన చుట్టుపక్కల నివసించుచున్న కుటుంబీకులకు శాంతి భద్రతలు లోపించాయి తాగుబోతులు విచ్చలవిడిగా ప్రవర్తించడం వలన ఆడపిల్లలు, స్కూల్ విద్యార్థులు భయంగా జీవిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక గొడవ, అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా గుడి కి పక్కనే ఈ వైస్ ఉండడం వలన గుడికి వచ్చే భక్తులు భయపడుతున్నారు. వాళ్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం బడికి దగ్గర, గుడికి దగ్గరలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదు అన్న నిబంధనలను కూడా తుంగలో తొక్కి ఈ వైన్స్ ని ఏర్పాటు చేశారు. దీనివలన ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. దారిన పోయే వాహనదారులు, ఫ్యామిలీస్ గా ఉన్నవాళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. తమరు దయచేసి ఆ షాపు మీద తగిన చర్యలు తీసుకోవాలని కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి లెటర్ పూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉపాధ్యక్షులు పిడికిటి గోపాల్ చౌదరి శనివారం వినతి పత్రాన్ని అందజేశారు.
Comments
 -Advertisement-