-Advertisement-

తొడుకున్నోళ్లకు తొడుకున్నంత...!

Vaasthava Nestham

•సుద్దవాగుల్లో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు
•ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
•అడుగంటుతున్న భూగర్భజలాలు
•చోద్యం చూస్తున్న అధికారులు


వాస్తవ నేస్తం,లోకేశ్వరం: మండలంలోని మన్మద్, అవర్గ, సాత్గాo, గ్రామంలోని సుద్ద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా యదేచ్చగా కొనసాగుతోంది. అడిగేవారు లేక పోవడంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదువు లేకుండా పోతుంది. సుద్ద వాగు నది నుండి ఇసుకను అక్రమంగా తరలించి లక్షలు గడుస్తున్న కూడా పట్టించుకునే నాథుడు కరువయ్యారు అనడంలో సందేహం లేదు. 
సుద్దనది పరివాహక ప్రాంతంలో కొందరు నాయకుల అండదండలతో నదిలో అక్రమ ఇసుక దందాకు తెర లేపారు. యదేచ్చగా అక్రమ ఇసుక దందా మాత్రం విచ్చల విడిగా కొనసాగుతోంది. ఇసుక మాఫియా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలు గాలికి వదిలేసి టాక్టర్లతో ఆక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. 
ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుద్ద నదిలో పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతూ 24 గంటలు ఆక్రమ ఇసుక రవాణా చేస్తున్న కూడా సంబంధిత శాఖ అధికారులు మౌనం వహించడంతో అధికారుల తీరుపై సత్వర విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఇసుక మాఫిపు ఇసుక మాఫియా పైన చర్యలు తీసుకుని భూగర్భ జలాలు అడుగంటకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
 -Advertisement-