-Advertisement-

మత్తు పదార్థం చల్లి.. నగదు కాజేసి...

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: ఒక వ్యక్తి పైన మత్తు పదార్థం చల్లి నగదును కాజేసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో మత్తు పదార్థం చల్లి అవినాష్ వద్ద నుండి 60 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. భైంసా నుండి వానల్ పాడ్ గ్రామానికి వెళ్తున్న అవినాష్ కు మండలంలోని వానల్ పాడ్ టోల్ గేట్ వద్ద ఆగివున్న ఇద్దరు వ్యక్తులు అవినాష్ పై మత్తు పదార్థం చల్లి (స్ప్రే ) తన వద్ద నున్న 60 వేల నగదును అపహరించారు. మత్తు పదార్థం స్ప్రే చేయడంతోఅవినాష్ కు 5 ని..ల తరువాత కోల్కొనగా, ఒక సారిగా తన జేబులో నగదు లేకపోవడంతో అవినాష్ పోలీసులకు సమాచారం అందించాడు. ఇట్టి విషయంపై అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Comments
 -Advertisement-