-Advertisement-

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... ఒకరికి తీవ్ర గాయాలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం. కేరళకు చెందిన సమీర్, అబ్దుల్ కరీం అనే ఇరువురు ఐచర్ వాహనంలో మహారాష్ట్రలోని అమరావతి నుండి కేరళకు సంతర్ పండ్లు తీసుకొని వెళ్తున్న క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మండల కేంద్రం గుండా వెళ్తున్న జాతీయ రహదారిపై, చర్చికి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సమీర్, కరీం లకు తీవ్ర గాయాలవ్వగా చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. తీవ్ర గాయాలైన సమీర్ చికిత్స పొందుతూ రూమ్స్ లో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని వాహనాన్ని పట్టుకొనుటకు ప్రత్యేక బృందం నియమించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
 -Advertisement-