-Advertisement-

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గడ్డం వినోద్

Vaasthava Nestham

- బారెపల్లి లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
- ఘనంగా స్వాగతం పలికిన డుబ్బుల కళాకారుల సంఘం, గ్రామ ప్రజలు


వాస్తవ నేస్తం,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీ పరిధిలోని బారెపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ రావడంతో గ్రామ ప్రజలు, డుబ్బుల కళాకారుల సంఘం వారు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సీసీ రోడ్ల మంజూరు చేయడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-