-Advertisement-

ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,సిర్పూర్‌(టీ): ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సిర్పూర్‌(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు పేర్కొన్నారు. మండలంలోని నవేగాం గ్రామంలో ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు సేవ చేసిన గొప్ప వ్యక్తి శివాజీ మహరాజ్‌ అని కొనియాడారు. ప్రజలంతా చైతన్యవంతులై గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులకు సిర్పూర్‌(టీ) శివాజీ మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
Comments
 -Advertisement-