-Advertisement-

Breaking news: వివాహేతర సంబంధం.. చివరకు హత్య చేసి శవాన్ని కాల్చి..

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,మంచిర్యాల: వివాహేతర సంబంధాలు హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని ఎన్నో పత్రికల్లో చదువుతూ ఉంటాం. అదే కోవకు చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే.. 
మంచిర్యాల జిల్లా చెన్నూరు (Mancherial district chennur Mandal) మండలం కమ్మరి పెళ్లి గ్రామానికి చెందిన పద్మ అనే మహిళతో పొన్నరం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ తో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇట్టి విషయం పెద్దలకు తెలవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చివరకు ఇరువురి కుటుంబ సభ్యులు ఇద్దరినీ సద్ది చెప్పారు. అయినప్పటికీ గత కొన్ని రోజులుగా మహేందర్ పద్మను వేధిస్తుండడంతో ప్లాన్ ప్రకారం.. పద్మ నిన్న రాత్రి(మంగళవారం) మహేందర్ కు ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని చెప్పడంతో మహేందర్ వెళ్ళగా, పద్మ తన కుటుంబ సభ్యులతో కలిసి మహేందర్ పై రోకలి దొడ్డితో దాడి చేసి గ్రామ శివారులోని వాగు ప్రాంతంలో శవాన్ని కాల్చి వేశారు. 
ఇట్టి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పద్మ, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments
 -Advertisement-