-Advertisement-

Echoda: మిషన్ భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోవాలి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మిషన్ భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోవాలని సామాజిక కార్యకర్త అబ్దుల్ సాభీర్ అన్నారు. మండల కేంద్రంలోని ఇస్లాం పుర, రంజాన్ పుర కాలనీలలో పలుచోట్ల మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని, పలుచోట్ల పైపు లీకేజీ పనులను ఈవో సూర్య ప్రకాష్ తో కలిసి ఆయన పరిశీలించారు. వేసవి దృశ్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రిపేర్లు చేయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Comments
 -Advertisement-