-Advertisement-

Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,కరీంనగర్: జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఈ రోజు (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు తల్లి, కూతురుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు పక్కకు తొలగించారు.
Comments
 -Advertisement-