-Advertisement-

Kukatpally: జనసేన పార్టీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,కూకట్పల్లి: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని కెపిహెచ్బి ఫిఫ్త్ ఫేజ్ జనసేన పార్టీ ఆఫీస్లో కూకట్పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ మరాఠా యోధుడు భవాని మాత చేత వీర ఖడ్గం పొంది నా గమ్యం, నా గమనం, హిందుత్వం అని నినదించిన వాడు మొగల్ సామ్రాజ్యాన్ని ఎదురించి ఛత్రపతి శివాజీ గా పేరుకెక్కినాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, శివాజీకి మహిళల పట్ల అపారమైన గౌరవం ఉండేది అని, విదేశీ బానిసత్వం నుండి హిందూ జాతిని రక్షించే నాయకుడు ఒక్క శివాజీనే అని దేశ ప్రజలందరూ గుర్తించారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-