-Advertisement-

Sangareddy: అయ్యప్ప స్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న పులి మామిడి రాజు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి 26వ వార్షికోత్సవంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ పులిమామిడి రాజు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. తదనాతరం ఆలయ కమిటీ వారు పులిమామిడి రాజుకు శాలువాతో ఘనంగా సత్కరించారు. తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భగా రాజు మాట్లాడుతూ.. ఈ ఆలయం రోజు రోజు కు అభివృద్ధి చెందుతుందని, ప్రతి యేటా అయ్యప్ప మాలాధారణకు ఇక్కడికి వివిధ గ్రామాలనుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారాని, ఈ దేవాలయం ముంబాయి హైవే రోడ్డు ప్రక్కన ఉండడం వలన భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఇంత మంచి వాతావరణాన్ని భక్తులకు అందిస్తున్నందుకు ఆలయ కమీటీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు గోనె శంకర్ స్వామి, సుధాకర్ స్వామి, నాయుడు స్వామి, బీజేపీ నాయకులు కోవూరి సంగమేశ్వర్, ఓదెల మాణిక్ రావు, గొర్లిల్లా శివ లింగం, వి.శ్రీశైలం, నల్ల సాయి కిరణ్, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు పవన్ గౌడ్, ఉల్లిగడ్డల నాగన్న, విశ్వనాధం పటేల్, కృష్ణ రెడ్డి, రాచన్న స్వామి, మరియు భక్తులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-