-Advertisement-

ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తీపోట్లతో ఒకరు మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: జిల్లాలోని భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ సమీపంలో శనివారం సాయంత్రం ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఒక యువకుడు వేరొక యువకుని పై కత్తితో దాడి కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే వర్గానికి చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరుగింది. ఒకరు కోపద్రికరమై మరొకరిపై కత్తితో దాడి చేయగా సొహెల్(23) అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కత్తిపోట్లు జరిగి మరణించిన సోహెల్ స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
 -Advertisement-