-Advertisement-

Breaking news: పంట పొలంలో మగశిశువు లభ్యం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,భీంపూర్: రోజు రోజుకు మానవత్వం మంట కలుస్తున్నాయి. తొమ్మిది నెలలు తన కడుపులో మోసిన ఓ తల్లి జన్మనిచాక పండంటి మగ బిడ్డను ఓ పంట పొలలో విడిసిపెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాపెల్లి గంగమ్మ గురువారం తెల్లవారుజామున ఊరు చివరన బహిర్భూమికి వెళ్ళింది. కాగా పక్కనున్న పంటపోలంలో ఓ పసికందు ఏడుపు వినిపించడంతో ఇంటికి తీసుకువెళ్ళి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
 -Advertisement-