-Advertisement-

Adilabad: మహిళను వేధించిన కానిస్టేబుల్ కి దేహశుద్ధి

Vaasthava Nestham

- మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కీచక పనులకు పాల్పడుతున్నారు. మహిళలకు భరోసా కల్పించాల్సిన పోలీసులు అడ్డదారులతోక్కుతున్నారు అని అనడానికి ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే... మహిళను వేధిస్తున్న కానిస్టేబుల్కు దేహశుద్ధి చేసిన ఘటన ఆదిలాబాద్ ధోబీ కాలనీలో చోటు జరిగింది. గురువారం ఉదయం భర్త లేని సమయంలో మహిళ ఇంటికి కానిస్టేబుల్ వెళ్లాడు. మహిళ కేకలు వేయడంతో కానిస్టేబుల్ గణేష్'ను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం కానిస్టేబుల్ గణేష్'ను కాలనీ వాసులు చితకబాదారు. అనంతరం మావల పోలీసు స్టేషన్'లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. యాపల్ గూడ బెటాలియన్ ఏఆర్ కానిస్టేబుల్గా గణేష్ పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
 -Advertisement-