-Advertisement-

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

Vaasthava Nestham

- రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీ అధికారులు 
 

వాస్తవ నేస్తం,ఆసిఫాబాద్: లంచాలు తీసుకుంటూ అధికారులు పట్టుబడుతున్న కూడా, అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం తీసుకుంటూ ఏసీబీకి ఓ ఎస్సై పట్టుబడిన సంఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మి ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రమాదం కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి, వాహనం రిలీజ్ చేసేందుకు ఆమె రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్న అధికారులు ఆమెను విచారిస్తున్నారు.
Comments
 -Advertisement-