-Advertisement-

దేవెగౌడ మనవాడి రాసలీలలు..కర్ణాటక రాజకీయాల్లో దుమారం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: లోక్ సభ ఎన్నికల వేళ 
కర్ణాటక రాజకీయాల్లో అశ్లీల వీడియోల కలకలం రేగింది. మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ మనువడి రాసలీలలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి. మహిళలతో అతను అసభ్యగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసన్ జిల్లాలో పలువురు మహిళను లైంగికంగా వేధించారంటూ ఆ వీడియోల్లో ఆరోపించారు. వైరల్ అవుతున్న వీడియోలు ప్రజ్వల్ డూప్తో చిత్రీకరించినవి, మార్ఫింగ్ చేసినవని ఆరోపిస్తూ హొలెనరసాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్ తరఫున ఫిర్యాదు దాఖలైంది. తన ప్రతిష్టను దిగజార్చేందుకు మార్ఫింగ్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. మహిళలను లైంగికంగా వేధించి, అసభ్యంగా ప్రవర్తించిన ప్రజ్వల్'ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులో నిరసన చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. అలాగే ఈ స్కాండల్'పై విచారణ జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బిజయ్ సింగ్ సారథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీంతో ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు వెళ్లారు.
Comments
 -Advertisement-