-Advertisement-

భానుడి ప్ర‌తాపం.. నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ న‌మోదు..

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నాగ్‌పూర్(వెబ్ డెస్క్): దేశ‌వ్యాప్తంగా ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. రోజురోజుకీ భానుడి ప్ర‌తాపానికి ప్ర‌జ‌లు విల‌విల‌లాడుతున్నారు. ప‌లు ప్రాంతాల్లో అత్య‌ధిక‌ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. తాజాగా నాగ్‌పూర్ పేనేగావ్‌లోని ఎడ‌బ్ల్యుఎస్ స్టేష‌న్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మ‌ద‌వ్వ‌గా.. ఉత్త‌ర అంబాజ‌రి రోడ్డులోని ఐఎండి కేంద్రంలో 56 డిగ్రీలు న‌మోదైంది. ఇటీల‌వ ఢిల్లీలోని ముంగేష్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఢిల్లీ చ‌రిత్ర‌లో ఇదే అత్య‌ధికం . ఎండలు, వ‌డ‌గాల్పుల కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో 54 మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం.

Comments
 -Advertisement-