-Advertisement-

ACB : ఏసీబీకి చిక్కిన ఏవో వంశీకృష్ణ

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఫర్టిలైజర్ షాపు లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.38 వేలు లంచం తీసుకుంటూ దహేగాం మండల వ్యవసాయ అధికారి ఏసీబీ కి పట్టుబడ్డారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కాగజ్ న‌గర్ డివిజన్ దహేగాం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న వంశీకృష్ణ, ఫర్టిలైజర్ షాప్ యజమాని శ్యామ్ రావు నుండి ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ రెన్యువల్ లైసెన్స్ కోసం రూ.50 వేలు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం శ్యామ్ రావు రూ.38 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అవినీతి నిరోధ‌క‌ శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో వంశీకృష్ణ అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ అయి కొన్నాళ్లకు విధుల్లో చేరారు. నిందితునిపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టుకు పంపుతున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
 -Advertisement-