-Advertisement-

దివ్యాంగ మహిళపై అత్యాచారం..

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు దివ్యాంగ మహిళపై హత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. 
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో తాజాగా ఓ షాకింగ్ వెలుగు చూసింది. లాల్సోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శనివారం అర్ధరాత్రి 34 ఏళ్ల వికలాంగ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు విన్న అత్తమామలు ఇరుగుపొరుగు వారితో కలిసి వచ్చి నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అనంతరం నిందితుడికి గుండు గీయించినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
 -Advertisement-