-Advertisement-

గుండాయిజాన్ని కూకటి వేళ్ళతో తొలగించాలి

Vaasthava Nestham

 - అక్రమ మైనింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి


వాస్తవ నేస్తం,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని ఐబీ తాండూర్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదారం పోలీస్ స్టేషన్'లో ఫిర్యాదు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రౌడీయిజాన్ని కూకటి వేల్లతో తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అన్నారని, గత ప్రభుత్వం మాదిరి తమ కాంగ్రెస్ ప్రభుత్వం విలేకరులకు స్వేచ్ఛనిచ్చామని పలు ఇంటర్వ్యూలలో తెలిపారని, కాని క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని మరల ఒకసారి అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలానికి చెందిన ఆదాబ్ హైదరాబాద్ విలేఖరి అంగల తిరుపతిపై దాడి చేసిన అక్రమ మైనింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మాదారం ఏఎస్సై పెద్దన్నకు విలేకరులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాలిగామ మల్లేష్, సంయుక్త కార్యదర్శి శనిగారపు వినోద్, సభ్యులు శ్రీకాంత్, పార్వతి అజయ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-