-Advertisement-

తల్లినే కడచేర్చిన కసాయి కొడుకు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: తన కన్నతల్లిని ఓ కొడుకు హత్య చేసి కసాయిగా మారిన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సిర్సా జిల్లాలో ఓ యువకుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో యువకుడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం కోసం వెళ్తుండగా తల్లి చావలి దేవి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తన కొడుకుని వద్దు అని ఆపేస్తుంది. దీంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు కర్ర తీసుకుని తల్లిపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం జిల్లా సివిల్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
 -Advertisement-