-Advertisement-

వైసీపీకి ఓటు వేసిందని తల్లిని హత్య చేసిన కొడుకు

Vaasthava Nestham

- అనంతపురం జిల్లాలో దారుణం


వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని, కొడుకు హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన వడ్డే సుంకమ్మకు(45) కుమారుడు వడ్డే వెంకటేశులు ఉన్నాడు. అతడు తెలుగుదేశంలో పార్టీలో పని చేస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశానని మాటల సందర్భంలో సుంకమ్మ కొడుకుకు తెలిపింది. దీంతో కోపంతో ఊగిపోయిన వెంకటేశులు మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు. మాటమాట పెరిగి క్షణికావేశంలో కన్నతల్లి తలపై ఇనుప సుత్తితో బాది పరారయ్యాడు. సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
 -Advertisement-