-Advertisement-

Breaking News: నిర్మల్'లో కత్తిపోట్ల కలకలం

Vaasthava Nestham

- ముగ్గురు యువకుల మధ్య ఘర్షణ
- కత్తులతో దాడులు
- ఒక యువకుడు మృతి


వాస్తవ నేస్తం,నిర్మల్: జిల్లా కేంద్రంలోని మిని ట్యాంక్ వద్ద దారుణ హత్య చోటు చేసుకుంది. వ్యక్తి గతకారణాలతో ముగ్గురు యువకులు గొడవపడి చివరకు కత్తిపోట్ల వరకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాట మాట పెరిగి సుమీర్ అనే యువకుడు చిక్కడపల్లి కి చెందిన జిశాన్, బుధార్ పేట్ కు చెందిన మతిన్ పై ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జీషాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మతీన్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు మతీన్ ను వెంటనే నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు. మతీన్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.
Comments
 -Advertisement-