-Advertisement-

ప‌శ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్ర‌మాదం.. 15 మంది మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప‌శ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. దార్జిలింగ్ జిల్లాలోని రంగ‌పాని స్టేష‌ణ్ స‌మీపంలో ఒకే ట్రాక్‌పైకి రెండు ట్రైన్‌లు ఢీకొన్నాయి. దీంతో ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఒక బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది మృతిచెంద‌గా మ‌రో 60 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. కాంచ‌న్‌జంఘా ఎక్స్‌ప్రెస్ అస్సాం లోని సిల్చార్ నుండి బ‌య‌ల్దేరి కోల్‌క‌తాలోని సీల్దాకు వెళ్ల‌వ‌ల‌సి ఉంది. ఇది మార్గ‌మ‌ధ్య‌లో న్యూజ‌ల్‌పాయ్‌గుడి వ‌ద్ద ఆగి బ‌య‌లుదేరింది. కొద్ది సేప‌టికే వెనుక‌నుండి గూడ్ ట్రైన్ వేగంగా వ‌చ్చి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదం పై రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం.
Comments
 -Advertisement-