-Advertisement-

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య..

Vaasthava Nestham

- టీచర్ హత్య కేసులో మిస్టరీని చేదించిన పోలీసులు 

- కిరాయి హంతకులతో పథకం రచించి..


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డువస్తున్నాడని తన ప్రియునితో కలిసి పథకం రచించి భర్తను కిరాతకంగా హత్య చేయించిన భర్తను భార్యను, ఆమె ప్రియుడు మహేష్, సుపారి తీసుకొని హతమార్చిన నిందితులు సుశీల్, పూర్వేత కృష్ణ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం పుత్తూరు డీఎస్పీ నాగేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న జాదవ్ గజేందర్ (32) ను ఈనెల 12న నార్నూర్ మండలం అర్జుని వద్ద దారిలో కాపు కాచి బండరాళ్లతో కొట్టి హతమార్చారు. హంతకులను పట్టుకోవడం కోసం డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి గజేందర్ భార్య విజయలక్ష్మిగా తేలింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడు మహేష్ తో భర్త హత్యకు కుట్ర పన్ని బేల మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సుశీల్, ఉరువేత కృష్ణతో సుపారి ఒప్పందం కుదుర్చుకున్నారు. గజేందర్ టీచర్ ను హతమారిస్తే ఆరు లక్షలు ఇస్తానని ప్రియుడు మహేష్ డీల్ చేయడంతో పథకం ప్రకారం టీచర్ గజేందర్ ను హతమార్చారు. టీచర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేదించి హంతకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Comments
 -Advertisement-