-Advertisement-

తుపాకితో కాల్చుకొని మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటీలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతి (22) ఎస్పీ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో తన వద్దనున్న సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు సందర్శించారు. కుటుంబసభ్యులకు సమాచారమందించి, పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
 -Advertisement-