-Advertisement-

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నేరడిగొండ: గుర్తి తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని దూద్ గండి వద్ద జాతీయ రహదారిపై ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఆనవాలు చూస్తే నేపాల్ కు చెందిన వ్యక్తిగా ఉన్నాడని, మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని రీమ్స్ తరలించినట్లు ఎస్సై తెలిపారు. సంబంధికులు ఎవరైనా ఉంటే ఈ 8712659947 నెంబర్ కు సంప్రదించాలని ఎస్సై తెలిపారు.
Comments
 -Advertisement-