-Advertisement-

bhole baba: ఎవరీ భోలే బాబా..?

Vaasthava Nestham

• దేవుడితో మాట్లాడుతానని నమ్మిస్తూ..
• గతంలో వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవించిన భోలో బాబా
• ఆ తర్వాత బాబాగా ప్రచారం
• మెల్లమెల్లగా రాష్ట్రమంతా పేమస్
• ఎక్కడ సభ పెట్టినా లక్షల్లో జనం


వాస్తవ నేస్తం,ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లో మంగళవారం జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కేసలాటలో ఎందరో మృతి చెందారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించింది భోలో బాబా.. అసలు ఈ భోలో బాబా ఎవరు..? bhole baba ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన ఎలా వచ్చింది..?? అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. యూపీ లోని హాథ్స్ జిల్లా సికంద్రా రావు పట్టణానికి సమీపంలో నిర్వహించిన సత్సంగ్ (ఆధ్యాత్మిక కార్యక్రమం)లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లా చెదురుగా పడిపోయిన మృతదేహాలతో భయానక వాతావరణం తలపించింది. ఘటన అనంతరం భోలే బాబా పరారవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలో అసలెవరీ భోలే బాబా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న బోలే బాబా యవ్వారం విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
Vaasthava Nestham Telugu Daily

Hathras stampede: Bhole Baba's villagers praises him, amid ongoing investigation

ఎవరీ భోలే బాబా..?


సరిగ్గా 28 ఏళ్ల క్రితం వేధింపుల కేసులో యూపీ పోలీసు శాఖలో లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎల్ఐయూ)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సూరజ్పాల్ జాతవ్ సస్పెండ్ అయ్యాడు. వేధింపుల కేసులో ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల కిందట ఆయన సస్పెండ్ అయ్యాడు. తర్వాత సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేశారు. ఈ కేసులో అతడు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అతని స్వస్థలం కన్గంజ్ జిల్లాలోని పాటియాలీ ప్రాంతంలోని బహదూర్ నగరి అనే గ్రామం. జైలు నుంచి విడుదలైన సూరజ్ పాల్.. పోలీసు సేవల నుంచి డిస్మిస్ కావడంతో కోర్టును ఆశ్రయించగా మళ్లీ ఉద్యోగం వచ్చింది. కానీ 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపాడు. పదవీ విరమణ తర్వాత స్వగ్రామం నాగ్లా బహదూర్పూర్ చేరుకుని అక్కడే తన డ్రామాకు తెర లేపాడు. తాను భగవంతుడితో మాట్లాడతానని తన గ్రామ ప్రజలకు చెప్పడం మొదలు పెట్టారు. తనకు తాను భోలే బాబాగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. అతడి మాయమాటలు నమ్మిన ప్రజలు ( bhole baba ) తండోపతండాలుగా కదలివచ్చేవారు. చూస్తుండగానే అతడికి లక్షలాది భక్తులు పుట్టుకొచ్చారు. అలా అనూహ్యంగా కొంతకాలానికే భోలే బాబా నారాయణ్ సాకార్ హరిగా అవతరించాడు. ఇతగాడి ప్రవచనాలకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర రాష్ట్రాలలో కూడా పిచ్చ ఫాలోయింగ్ ఉంది. కొద్దికాలంలోనే ఆయనకు పెద్ద సంఖ్యలో అనుచరులు పుట్టుకొచ్చారు. ఎక్కడ సమావేశం నిర్వహించినా వేలసం ఖ్యలో ప్రజలు వచ్చేవారు.

కానిస్టేబుల్ కొలువు వదిలేసి బాబాగా అవతరణ

ప్రతి మంగళవారం వివిధ ప్రాంతాల్లో 'సత్సంగ్' పేరటి పెద్ద సమావేశాలు నిర్వహించేవాడు. ఇటీవల హత్రాస్లో జరిగిన సంఘటనకు సరిగ్గా వారం ముందు మెయిన్పురి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించాడు. కరోనా మహహ్మారి టైంలో 2022లో భోలే బాబా సమావేశాలకు కేవలం 50 మందిని మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఏకంగా 50 వేల మంది హాజరుకావడంతో అప్పట్లోనే పెద్ద వివాదానికి దారి తీసింది. సూరజ్పాల్ అలియాస్ భోలే బాబాకు ముగ్గురు సోదరులలో ఒకరని, అందరిలో పెద్దవాడు సూరజ్ పాల్, రెండో సోదరుడు మరణించగా, మూడో సోదరుడు గ్రామ పంచాయతీ సర్పంచ్'గా పని చేస్తున్నాడు. భోలే బాబా చాలా అరుదుగా తన ఊరు వెళ్తుంటాడు. సర్కార్ కొలువు వదిలేసి ఇక్కడి దాకా ఎలా ఎదిగాడో తెలియదని సత్సంగ్లలో అనేకమార్లు చెప్పుకునేవాడు.

హత్రాస్ ఘటన తర్వాత పరార్..


తాజాగా ఘటనలో నారాయణ్ సాకార్ హరి పేరుతో హత్రాస్'లో ఈ కార్యక్రమం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హాథ్రస్ వీధుల్లో అన్ని ఇతగాడి పోస్టర్లే పెద్ద ఎత్తున పెట్టారు. నారాయణ్ సాకార్ను ప్రజలు భోలే బాబా, విశ్వహరి అనే పేర్లతో పిలిచేవారు. జూలై నెల తొలి మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని 'మానవ్ మంగళ్ మిలన్' పేరుతో నిర్వహించారు. 'మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగమ్ సమితి' అనే పేరుతో మొత్తం ఆరుగురి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు బోలేబాబా కూడా పరారయ్యాడు. ప్రస్తుతం వారందరి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో స్థానిక పోలీసులు వారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. వీరి కోసం యూపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఇంతటి మారణ హోమానికి కారణమైన సత్సం గ్ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీపై, బోలే బాబాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అలీగఢ్ ఐజీ శలభ మాథుర్ చెప్పారు.

ఎక్కడా విరాళాలు సేకరించలేదు..


బోలే బాబాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అతను ఇప్పటి వరకు భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు, దక్షిణలు, కానుకలను తీసుకోలేదు. కానీ, ఉ త్తరాదిలో అనేక ఆశ్రమాలను ఎలా స్థాపించాడు అనే విషయం ఎవరికీ బోధపడకుంది. ఉత్తరప్రదేశ్లోనే వేర- ఎవేరు ప్రాంతాల్లో సొంత స్థలాల్లో ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలలోనే భక్తులకు కనిపిం చేవాడు. పైజామా కుర్తా, ప్యాంట్ -షర్ట్, సూట్లలో ఎక్కువగా కనిపిస్తాడు. ఇంతటి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోగానీ, ఇంటర్నెట్లో గానీ ఇతని గురిం చి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం మరో విచిత్రం. క్షేత్రస్థా యిలో మాత్రం ఆయనకు లక్షలాది భక్తులున్నారు. అతను నిర్వహించే కార్యక్రమాల్లో వందలమంది వలంటీర్లు ఉ ౦టారు. వీరు భక్తులకు ఉచితంగా నీళ్లు, ఆహారం పంచ డం నుంచి రద్దీని నియంత్రించేంత వరకు అన్నీ వారే చూసుకుంటూ ఉంటారు.
Comments
 -Advertisement-