-Advertisement-

దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

Vaasthava Nestham

- నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తుండగా ఘటన
- డైల్ 100 కు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ 
- బస్సును చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు 
- ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు


వాస్తవ నేస్తం,హైదరాబాద్‌: ప్రైవేటు బస్సులో
 దారుణం జరిగింది. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ మహిళ కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు ప్రైవేట్ ట్రావెల్స్'లో వెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. డిన్నర్ తర్వాత బస్సును తోటి డ్రైవర్‌కు అప్పగించిన మెయిన్ డ్రైవర్ కృష్ణ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులో నోట్లో బెడ్ షీట్ కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మల్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ అఘాయిత్యం జరిగిందని పేర్కొంది.. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా డయల్ 100కి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన పోలీసులు బస్సును ఛేజ్ చేశారు.. ఈ క్రమంలో తార్నాక దగ్గర ఓయూ పోలీసులు బస్సును అడ్డగించి పట్టుకున్నారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు మరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ఓయు (ఉస్మానియా యూనివర్సిటీ) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
 -Advertisement-