-Advertisement-

కరెంట్ షాక్'తో బాలుడు మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,గుడిహత్నూర్: మండలంలోని గురుజ గ్రామంలో మంగళవారం కరంట్ షాక్ ఓ బాలుడు మృతి చెందినట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఎస్సై తెలిసిన వివరాల ప్రకారం.. గురుజ గ్రామానికి చెందిన జాదవ్ కార్తీక్(17) తన బావతో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఇనుప కంచెను పట్టుకోవడంతో ఒకేసారి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. అది గ్రహించిన మృతుడి బావ హుటాహుటిన కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
 -Advertisement-