-Advertisement-

ఏజెన్సీ ప్రాంతంలో ఫీజుల దోపిడి అరికట్టాలి: టీజీవిపి నాయకులు కొట్టూరి ప్రవీణ్ కుమార్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఏజెన్సీ మండలమైన ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ లలో ఫీజుల దోపిడీ జరుగుతోందని టీజీవిపి నాయకులు కొట్టూరి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు విద్యా వ్యాపారం చేస్తున్నాయని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలకు తోక పేర్లు జోడిస్తున్నారని అన్నారు. పాఠశాలలలోనే పుస్తకాలు యూనిఫామ్ లు విక్రయిస్తున్నారని, సంబంధిత పాఠశాలలపై జిల్లా స్థాయి విద్యా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు డిమాండ్ చేశారు. లేని ఎడల నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్, కో కన్వీనర్ సతీష్, సాయి, గణేష్, పవర్ సురేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.



Comments
 -Advertisement-