-Advertisement-

వర్తమన్నూర్ గ్రామంలో ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవన్ని పురస్కరించుకొని బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నుండి ప్రారంభమైన ర్యాలీ డోలు వాయిధ్యలతో ఆదివాసీ నినాదాలతో కొమరం భీమ్ విగ్రహం వరకు వెళ్లి జెండా ఆవిష్కరణ చేసి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పలువురు ఆదివాసి నాయకులు మాట్లాడుతూ.. ఆదివాసీల స్థితి గతులను వివరించి ఆదివాసీల ఎదుగుదలకు విద్య చట్టాలను వాడుకుంటూ ముందుకు సాగాలని పిసా అటవీ హక్కులు 1/70 చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసులు నాయకులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-