-Advertisement-

శిశువును పీక్కుతిన్న కుక్కలు

Vaasthava Nestham

- ఎంజీఎంలో ఆస్పత్రి ఆవరణలో ఘటన


వాస్తవ నేస్తం,వరంగల్: జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో ఘోర ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డు ముందు ఓ శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి. గమనించిన రోగుల బంధువులు వాటిని తరిమి శిశువును అత్యవసర విభాగానికి తీసుకువెళ్లారు. అప్పటికే కుక్కలు శిశువు నడుము కింది భాగం తినడంతో చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. కుక్కలు బతికి ఉన్న శిశువును తీసుకు వచ్చి తిన్నాయా..? లేక చనిపోయిన శిశువును తీసుకువచ్చాయా..? అనేది తెలియాల్సి ఉంది. అత్యవసర విభాగానికి కొద్ది దూరంలోనే పిల్లల వార్డు కూడా ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి. శిశువు మృతదేహమును ఎంజీఎం మార్చురీలో భద్రపరిచి, ఎంజీఎం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తమ హాస్పిటల్'కు సంబంధించిన శిశువు కాదని, కుక్కలు బయటి నుంచి తీసుకువచ్చి ఉండవచ్చని సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
 -Advertisement-