-Advertisement-

బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు.. అసలు ఏం జరిగింది.?

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: పండగపూట విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడడం కలకలం రేపింది. తాడ్వాయి మండలం నందివాడలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నందివాడలోని ఓ బావిలో ఆదివారం ఉదయం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కాగా.. మృతి చెందిన చిన్నారులు విగ్నేష్(7), అనిరుద్(5)గా గుర్తించారు. అయితే బావి వద్ద చిన్నారుల తండ్రి చిట్టపు శ్రీనివాస్ ఫోన్ తో పాటు చెప్పుల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయనే చిన్నారులను బావిలోకి తోసేసి సూసైడ్ చేసుకుని ఉంటారా..? లేక మరేమైనా జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. బావిలోని ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు.. అందులోని నీటిని తొడేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Comments
 -Advertisement-