-Advertisement-

వాహనం ఢీకొని మహిళ మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: గుర్తు తెలియని వాహనం ఢీకొని  మహిళ మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి మండలంలో జరిగింది. ఎస్సై మెల్లడించిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నిర్మల్ బైపాస్ వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ అక్కడికి అక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. అదేసమయంలో ఆదిలాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్ర కు చెందిన MH06 BW 3620 నెంబర్ గల బస్సు డీకొట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఎవరైనా మహిళా మృతదేహాన్ని గుర్తుపడితే పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
 -Advertisement-