-Advertisement-

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం.. పురుగుల మందు తాగి బావ, మరదలు ఆత్మహత్య

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,తలమడుగు: ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తలమడుగు మండలం ఉండం గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉండం గ్రామానికి చెందిన రాకేశ్, ఆయన భార్య లావణ్య, కూతురు ప్రశంస, మేన మరదలు స్పందన వారి పంట పొలానికి వెళ్లారు. వారి మధ్య అక్కడ ఏం జరిగిందో తెలియదు. రాకేశ్ (34), అతని మేన మరదలు స్పందన (19) పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని రిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. వారిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సీఐ ఫణీందర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
 -Advertisement-