వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : మందు పాత్రను నిర్వీర్యం చేయడంతో భద్రత బలగాలకు పెను ప్రమాదమే తప్పింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) సుకుమా జిల్లా పుల్ భగిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బడేసట్టి అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన 40 కేజీల మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించారు. మందుపాతర వలన ఎవరికి ప్రమాదం వాటిల్లకుండా నిర్మానుష్య ప్రాంతంలో పేల్చివేశారు. దీంతో బలగాలకు పెను ప్రమాదం తప్పింది. ముందుగా గుర్తించక పోయి ఉంటే భారీ సంఖ్యలో భద్రతా బలగాలు మృతి చెందేవారు. చాకచక్యంగా భద్రత బలగాలు ఈ మందు పాత్రను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
Chhattisgarh | భద్రత బలగాలకు తప్పిన పెను ప్రమాదం..?! ఆ మందు పాత్ర ఎవరికోసం.?
RELATED ARTICLES
