📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeCrime NewsKamareddy : కుటుంబ సభ్యులు తిడుతున్నారని సెల్‌ టవర్‌ ఎక్కిన వృద్ధుడు

Kamareddy : కుటుంబ సభ్యులు తిడుతున్నారని సెల్‌ టవర్‌ ఎక్కిన వృద్ధుడు

వాస్తవ నేస్తం,కామారెడ్డి: వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించానని కుటుంబ సభ్యులు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇక తనకు చావే శరణ్యమని జంగంపల్లికి చెందిన వృద్ధుడు కర్రోల్ల చిన్న మల్లయ్య మంగళవారం సెల్‌ టవర్‌ ఎక్కాడు. ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని టవర్‌పై ఉన్న మల్లయ్యతో ఫోన్‌లో మాట్లాడి సముదాయించడంతో అతడు కిందికు దిగాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, తనపై వేడి టీ పోశారని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనకు చావే దిక్కని భావించి సెల్‌టవర్‌ ఎక్కానని అన్నాడు.

ఇది కూడా చదవండి :  Maoist party leader Bandi Prakash | మావోయిస్టు పార్టీ కీలకనేత బండి ప్రకాష్ లొంగుబాటు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page