📄 ePaper
Monday, February 16, 2026
📄 ePaper
HomeEducationTelangana TET | టెట్ ఫలితాల్లో విస్మయం: 27,700 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్! 

Telangana TET | టెట్ ఫలితాల్లో విస్మయం: 27,700 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్! 

• ఆత్మరక్షణలో పడ్డ విద్యావ్యవస్థ..?

వాస్తవ నేస్తం,హైదరాబాద్ (స్పెషల్ బ్యూరో): తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఉపాధ్యాయ కొలువుల కోసం పరీక్ష రాసి అభ్యర్థులు కచ్చితంగా టెట్ పరీక్ష పాస్ అవ్వాలని నిబంధన ఉంది. దీంతోపాటు ఇటీవల ప్రభుత్వం ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు సైతం పరీక్షను పాస్ అవ్వాలని కొత్త నిబంధన తీసుకువచ్చింది. దీంతో ఒకపక్క ఉపాధ్యాయ కొలువుల కోసం కోసం సిద్ధమయే అభ్యర్థులు , మరోపక్క ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ పరీక్షను రాశారు. ఇటీవల వెలువడిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఫలితాలు ఒక్కసారిగా విస్మయానికి గురిచేశాయి. భావి ఉపాధ్యాయులే కాకుండా, ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షకు హాజరవ్వగా, ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 27,700 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు (In-service Teachers) టెట్ పరీక్షలో అర్హత సాధించలేకపోవడం విద్యా వర్గాలను షాక్‌కు గురిచేసింది.

విద్యాహక్కు చట్టం (RTE) మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఈ క్రమంలో పదోన్నతులు (Promotions) మరియు ఇతర ప్రయోజనాల కోసం ఇప్పటికే సర్వీసులో ఉన్న వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇటీవల జరిగిన టెట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే, వారిలో దాదాపు 27,700 మంది కనీస అర్హత మార్కులను కూడా సాధించలేకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి :  Mediguda Ashram School : మేడిగూడ ఆశ్రమ బాలికల పాఠశాలలో నిత్యావసర సరకులు పక్కదారి

ప్రశ్నార్థకంలో బోధనా ప్రమాణాలు :

పిల్లలకు విద్యాబుద్ధులు నేంపి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువులే.. తమ అర్హత పరీక్షలో చతికిలపడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి రోజూ తరగతి గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, తమ సబ్జెక్టుపై పట్టు కోల్పోయారా.? లేక పరీక్షా విధానం మారిందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందా లేదా అన్న సందేహాలకు ఈ ఫలితాలు బలం చేకూరుస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ వైఫల్యానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. సబ్జెక్టుపై పట్టు సడలడం: కొన్నేళ్లుగా ఒకే తరగతి లేదా ఒకే మూసలో పాఠాలు బోధించడం వల్ల, పోటీ పరీక్షల స్థాయికి తగినట్లుగా సబ్జెక్టుపై లోతైన అవగాహన తగ్గి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులలో చాలామంది మధ్యవయస్కులు కావడం, ఇప్పుడున్న కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్యాట్రన్‌కు అలవాటు పడలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెట్ సిలబస్ మరియు ప్రశ్నల సరళి క్లిష్టంగా మారుతోంది. దీనిని అందుకోవడంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విఫలమయ్యారనే వాదన సైతం వినిపిస్తోంది.

ప్రభుత్వం ముందున్న సవాలు :

ఈ ఫలితాలు ప్రభుత్వం ముందు పెద్ద సవాలునే ఉంచాయి. ఫెయిల్ అయిన ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? వారికి మళ్ళీ శిక్షణ ఇస్తారా..? లేక మరో అవకాశం కల్పిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో, ఈ ఫెయిల్యూర్ వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. మరోవైపు, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వానికి, ఈ ఫలితాలు మింగుడు పడని అంశంగా మారాయి. ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి :  Mediguda aashram School : మేడిగూడ ఆశ్రమ పాఠశాల హెడ్‌మాస్టర్ సస్పెన్షన్

టెట్ కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు, అది ఉపాధ్యాయుని సామర్థ్యానికి కొలమానం. 27,700 మంది ఉపాధ్యాయులు విఫలమవ్వడం అనేది కేవలం వారి వ్యక్తిగత వైఫల్యం కాదు, అది వ్యవస్థాగత లోపాలకు అద్దం పడుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై తక్షణమే సమీక్ష జరిపి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వ విద్యపై ప్రజలకున్న నమ్మకం మరింత సన్నగిల్లే ప్రమాదం ఉంది.

Note: The image used in this article is AI-generated and is for representation purposes only.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page