📄 ePaper
Wednesday, March 11, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadRims Director | నిజమైన 'ఆపద్బాంధవుడు' రిమ్స్ డైరెక్టర్ డా. రాథోడ్.!!

Rims Director | నిజమైన ‘ఆపద్బాంధవుడు’ రిమ్స్ డైరెక్టర్ డా. రాథోడ్.!!

ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో రిమ్స్ డైరెక్టర్ డా. జై సింగ్ రాథోడ్ తీసుకున్న తక్షణ చర్యలు ఒక మైలురాయిగా నిలిచాయి. ‘కనిపించని దేవుడు ఆదిలాబాద్‌లో ఉన్నాడు’ అనే వాక్యం, కేవలం మాట కాదు, ఆపదలో ఉన్న రోగి పట్ల ఆయన చూపిన అంకితభావానికి, మానవత్వంతో కూడిన చికిత్సకు తీసుకున్న తక్షణ చర్యలకు ప్రతిబింబం. బేలా మండలం సదల్పూర్ గ్రామానికి చెందిన టీకం పోతుభాయి అనే రోగి అక్టోబర్ 6న రిమ్స్‌ లో (Adilabad Rims) చేరారు. రోగి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించిన డా. రాథోడ్, కాలయాపన లేకుండా అక్టోబర్ 7న సీటీ స్కాన్, అక్టోబర్ 11న ఎంఆర్‌ఐ (MRI) వంటి అత్యున్నత పరీక్షలను యుద్ధప్రాతిపదికన చేయించారు. ఈ వేగవంతమైన స్పందన, ప్రభుత్వ ఆసుపత్రి అంటే కేవలం కనీస వసతులు మాత్రమే కాదనీ, ప్రతి రోగి పట్ల అంకితభావం ఉండాలనే గొప్ప సందేశాన్నిచ్చింది. ఈ చర్యలు రిమ్స్ వైద్య సేవల నాణ్యతలో వస్తున్న సానుకూల మార్పులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అరుదైన సవాలును అధిగమించిన ‘ఆపద్బంధువుల’ కృషి.. 

రోగ నిర్ధారణకు కీలకమైన ‘కాంట్రాస్ట్ ఎంఆర్‌ఐ’ కోసం అవసరమైన అరుదైన ఇంజక్షన్, ప్రభుత్వ టెండర్ల జాబితాలో లేకపోవడంతో ఆసుపత్రికి తక్షణ సవాలు ఎదురైంది. ఈ సాంకేతిక అడ్డంకి ముందు రిమ్స్ (Rims) యాజమాన్యం తలవంచలేదు. స్థానిక సరఫరాదారులు మొదలుకొని హైదరాబాద్‌లోని ఏజెన్సీల వరకు సంప్రదించినా, వరుస సెలవుల కారణంగా ఔషధం సరఫరా ఆలస్యమైంది. ఇక్కడే డా. రాథోడ్ బృందం నిజమైన ఆపద్బంధువుల పాత్రను పోషించింది. వారు ఈ లోపాన్ని సాకుగా చూపకుండా, మానవతా దృక్పథంతో తక్షణమే రంగంలోకి దిగి, నిబంధనలకు లోబడి వేగవంతమైన చర్యలు తీసుకుని, ఆ అత్యంత అవసరమైన ఔషధాన్ని ఆసుపత్రిలో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. చికిత్స ఆలస్యం అవుతుందన్న ఆందోళనతో రోగి కుటుంబ సభ్యులు అభ్యర్థించగా డిశ్చార్జ్ చేసినప్పటికీ, ఔషధం లభించిన వెంటనే రిమ్స్ యాజమాన్యం వారికి సమాచారం అందించడం, రోగి శ్రేయస్సే తమ అత్యంత ప్రాధాన్యత అని నిరూపించింది.

ఇది కూడా చదవండి :  Operation kaghar | మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా లొంగిపోతాడా..?

జిల్లా యంత్రాంగం అండ – ప్రభుత్వ సేవల్లో అద్భుత సమన్వయం.. 

ఈ మొత్తం ఉదంతంలో ఆదిలాబాద్ (Adilabad) జిల్లా యంత్రాంగం అందించిన అండ, ప్రభుత్వ సేవల్లోని అద్భుత సమన్వయాన్ని చాటింది. రోగికి మెరుగైన చికిత్స అందించాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) స్వయంగా బేలా మండలం సదల్పూర్ గ్రామానికి వెళ్లారు. వారు రోగి కుటుంబానికి పరిస్థితిని, చికిత్స వివరాలను పూర్తిగా తెలియజేయడమే కాక, రిమ్స్‌ లోనే చికిత్స కొనసాగించవచ్చని నమ్మకంగా సూచించారు. ఈ చర్య, కేవలం ఒక ఆసుపత్రి ప్రయత్నం కాదనీ, జిల్లా యంత్రాంగం మొత్తం రోగికి అండగా నిలబడిందనే గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి పంపింది. ప్రభుత్వ అధికారులు, వైద్యులు కలిసి పనిచేస్తే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఈ సంఘటన నిరూపించింది.

Rims director | మెరుగైన వైద్య భవిష్యత్తుకు రిమ్స్ డైరెక్టర్ డా. జై సింగ్ రాథోడ్ భరోసా..

ఆదిలాబాద్ రిమ్స్‌ లో అధునాతన వైద్య పరీక్షలు (సీటీ, ఎంఆర్‌ఐ) (CT scan) అందుబాటులో ఉండటం, అరుదైన మందుల కోసం యాజమాన్యం చూపిన అంకితభావం, మరియు జిల్లా యంత్రాంగం అందించిన సమష్టి మద్దతు – ఇవన్నీ కలిసి ఆదిలాబాద్‌లో మెరుగైన వైద్య భవిష్యత్తుకు స్పష్టమైన భరోసానిస్తున్నాయి. డా. జై సింగ్ రాథోడ్ నాయకత్వం, చికిత్స ఆలస్యమైతే ఆందోళన చెందడం సహజం అయినప్పటికీ, రిమ్స్ బృందం తీసుకున్న తక్షణ చర్యలు మానవత్వ విలువలు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని నిజమైన ‘ఆపద్బాంధవుడి’ కేంద్రంగా మారుస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంఘటన ఆదిలాబాద్ ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసాన్ని పెంపొందించింది, రిమ్స్‌ ను ప్రజల ఆపదల్లో అండగా నిలిచే సంస్థగా నిలబెట్టింది.

ఇది కూడా చదవండి :  Echoda Sarpanch Elections |నా పైసలు నాకు ఇవ్వండి.. లేకుంటే...

వ్యాసకర్త : ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9640466464

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page